రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

బతుకమ్మ , పిట్లం : పిట్లం మండల వ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ కార్యాలయంలో నాయకుల పాలన లేకపోవడంతో అధికారులే జెండాను ఎగరవేశారు. తాసిల్ కార్యాలయంలో వేణుగోపాల్ గౌడ్, పోలీస్ స్టేషన్లో రాజు, ఎంపీడీవో కార్యాలయంలో కమలాకర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇంద్ర గాంధీ విగ్రహం దగ్గర, బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వాసరి రమేష్, బిజెపి జెండాను అభినయ రెడ్డి, ప్రభుత్వ కార్యా ఆలయాల్లో ఆయా శాఖల అధికారులు జెండాను ఎగురవేసి మిఠాయిలు పంచుకున్నారు. మండలంలోని 26 గ్రామపంచాయతీలలో కార్యదర్శిలు జెండాను ఎగరవేశారు.

A fluttering three-moon flag
Comments (0)
Add Comment