పెళ్లికి వచ్చి విద్యుత్ షాక్ తో మృతి

. మాయాపూర్ లో  విషాదం

బతుకమ్మ, బాల్కొండ : బంధువుల పెళ్లికి వచ్చిన  ఓ యువకుడు విద్యుత్ షాక్ తో మృతి చెందిన ఘటన ఉమ్మడి బాల్కొండ మండలం రెంజర్లలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. నందిపేట మండలం మాయాపూర్ గ్రామానికి చెందిన గుడోల్ల అభిలాష్(20) తన బంధువుల ఇంట్లో పెళ్లిలో పాల్గొనేందుకు రెంజర్లకు వచ్చాడు. మంగళవారం రాత్రి ఓ వైపు హల్దీ వేడుక జరుగుతున్న సమయంలో ఫోన్ రావడంతో అభిలాష్ దాబాపైకి వెళ్లాడు. ఫోన్ మాట్లాడుతూ పొరపాటు పెళ్లి వేడుకల కోసం వేసిన లైటింగ్ కు చేయి తగలడంతో మృతి చెందాడు. పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది.

Died due to electric shock after coming to a wedding
Comments (0)
Add Comment