గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి

బతుకమ్మ,మోర్తాడ్: భక్తిశ్రద్ధలతో ఆనందోత్సవాల మధ్య ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని మోర్తాడ్ ఎస్సై విక్రమ్ తెలిపారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో మంగళవారం గణేష్ ఉత్సవములు నిర్వహణ గురించి కమిటీ నిర్వహించడమైనది. శాంతి భద్రత పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్య కావాలని ప్రజలతో ఫ్రెండ్లీ పోలీస్ గా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. ప్రజలందరూ తమ పోలీస్ యంత్రాంగానికి సకల విధాల సహకారాలు అందజేయాలని తెలిపారు. కార్యక్రమంలో మోర్తాడ్ మండలంలోని అన్ని గణేష్ మండపములు నిర్వహించు సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు హాజరయ్యారు.

Ganesh festivals should be celebrated peacefully
Comments (0)
Add Comment