ప్రజా సమస్యలను పరిష్కరించాలి

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని ప్రతి గ్రామంలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భిక్కనూరు మండల బీజేపీ ఇంచార్జ్ శ్రీధర్ రెడ్డి కోరారు . ప్రతి గ్రామంలో కామరెడ్డి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫిర్యాదు పెట్టల్లో వచ్చిన ఫిర్యాదులను శుక్రవారం ఎంపీడీవో ఎమ్మార్వో కార్యాలయాల్లో బిజెపి నాయకులు అందజేశారు. అనంతరం శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఫిర్యాదు పెట్టెలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు రమేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Public problems should be solved
Comments (0)
Add Comment