తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

  • సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి వేడుకల్లో పాల్గొన్న నిజామాబాద్ గౌడ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు పుట్టనాతి కిషోర్ గౌడ్

బతుకమ్మ నిజామాబాద్ బ్యూరో
తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతికగా నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలను ఆదివారం నగరంలోని వినాయక్ నగర్ లో గల సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిజామాబాద్ జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడు పుట్టనాతి కిషోర్ గౌడ్ మాట్లాడుతూ…. రాచరికపు వ్యవస్థ నీడలో జమీందార్లు, జాగీర్దాల అరాచకాలను సహించలేక కడుపుమండి కత్తి పట్టిన వీరుడని కొనియాడారు. దళిత, బహుజనులు ఏకమై పోరాడితేనే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన సామాన్యుడని గుర్తు చేశారు. రఘునాథపల్లి మండం ఖిలాషాపూర్ను కేంద్రంగా చేసుకొని మొఘలుల ఆధిపత్యాన్ని ఎదిరించి గోల్కొండ కోటపై జెండా ఎగుర వేసిన మహనీయుడు అతడే బహుజన వీరుడు సర్వాయి పాపన్న అని తెలిపారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా దళితులు, బహుజనులు ఐక్యంగా పోరాడి రాజ్యాధికార దిశగా అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో.గవర్నమెంట్ ప్లీడర్
వెంకట్ రమణ గౌడ్ బీసీ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గౌడ యువజన సంఘం,జిల్లా అధ్యక్షులు కిషోర్ గౌడ్ గౌడ సంగం నాయకులు రాజ్ గోపాల్ గౌడ్,సిరిగదా స్వామి గౌడ్,అఖిల్ గౌడ్, బాబా గౌడ్ తదితరులు పాల్గొన్నారు,

Sardar Sarvai Papanna Goud is a symbol of Telangana Bahujan's self-respect and bravery
Comments (0)
Add Comment