పది మందిపై పిచ్చి కుక్కదాడి

నందిపేట, బతుకమ్మ: నందిపేట మండల కేంద్రంలో పిచ్చి కుక్కస్వైర విహారం చేసింది. సోమవారం ఉదయం 10 మందిపై దాడి చేసి గాయపర్చింది. దీంతో మండల కేంద్రవాసులు భయాందోళనకు గురయ్యారు. నిన్న ఉమ్మడి మండలంలోని దత్తాపూర్ లో పలువురిని పిచ్చి ఓ కుక్క గాయపర్చగా, ఇవ్వాళ ఉదయం నందిపేటలో పిచ్చి కుక్క దాడి చేయడం కలకలం రేపింది. కుక్కలు గుంపులుగుంపులుగా వీధుల్లో తిరుగుతూ వెంటపడుతున్నాయని, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులను సంప్రదిస్తే జంతు రక్షణ చట్టం కారణంగా కుక్కలను చంపే అధికారం తమకు లేదని జవాబిస్తున్నారాని వాపోతున్నారు. మనిషి ప్రాణాలకు లెక్కే లేదా అని ప్రశ్నిస్తున్నారు. కుక్కలను పట్టుకొని వేరే ఏ ప్రాంతాల్లో లేదా అటవీ ప్రాంతాల్లో వదిలేయాని కోరుతున్నారు.

Ten people were bitten by one dog
Comments (0)
Add Comment