భిక్కనూరు లో ఘనంగా వినాయక చవితి

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని అన్ని గ్రామాల్లో వినాయక చవితి పండుగను వాడవాడలా ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రతి వాడ వాడల గణేష్ మండపాలను సర్వాంగ సుందరంగా తీరోక పువ్వులతో ముస్తాబ్ చేసి గణనాథులను ప్రతిష్టించారు. ఈ సందర్భంగా సౌండ్ బాక్సులు, బ్యాండ్ చప్పులతో చవితి వెళ ఊళ్లన్నీ చిన్న పెద్ద లతో సందడిగ మారాయి. పర్యావరణ హితం కోరుతూ మండలంలోని పెద్ద మల్లారెడ్డి లో దారంతో వినూత్న రీతిలో గణపతిని తయారు చేసిన పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన కోడూరు పరుశురాం గౌడ్ ను సిద్ధరామేశ్వర ట్రస్ట్ సభ్యులు సన్మానించి అభినందించారు. ఇలానే ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మట్టి గణపతులను వాడాలని పర్యావరణాన్ని రక్షించాలని సిద్ధరామేశ్వర ట్రస్ట్ సభ్యులు కోరుతున్నారు.

Vinayaka was celebrated in Bhikkanur
Comments (0)
Add Comment