– ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి….
నర్సాపూర్ , సెప్టెంబర్ 29( అక్షర కలం వెబ్ ):-
సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ అని ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి అన్నారు,
సోమవారం గోమారం గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే వివిధ రకాల పూలతో గుత్తులుగా పేర్చి బతుకమ్మను తయారుచేశారు,
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..ప్రపంచంలో ఎక్కడైనా దేవతల్ని పూలతో పూజించడం ఆనవాయితీగా వస్తె..మన తెలంగాణా లో మాత్రం పూలనే దేవతగా భావించి పూజించే గొప్ప సంస్కృతి అన్నారు,బతుకమ్మ పండుగ కుల మత వర్గ భేదాలు లేకుండా పది రోజుల పాటు జరుపుకునే వార్షిక తెలంగాణా లో అతి పెద్ద పండుగ అని చెప్పారు, సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు జరుపుకునే ఈ పండుగ సమయం నవరాత్రి పండుగతో సమానంగా ఉంటుందని ఆమె అన్నారు
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు చంద్రాగౌడ్ ,బిక్షపతి రెడ్డి, నర్సింహా రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి ,శశిధర్ రెడ్డి,మహిపాల్ రెడ్డి,రాకేష్ రెడ్డి,కుంట లక్ష్మణ్,సమీర్ సాకేత్,సుశాంత్,భరత్ సింహా రెడ్డి,సుశాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు…