పెన్షన్ ప్రతీ ఉద్యోగి హక్కు

  • పీఆర్టీయు తెలంగాణ జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : పెన్షన్ అనేది ప్రతీ ఉద్యోగి హక్కు అని పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ అన్నారు. పి ఆర్ టి యు తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు శనివారం పెన్షన్ విద్రోహ దినం నిర్వహించినట్లు  తెలిపారు. స్థానిక రామ్ మందిర పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ పాత పెన్షన్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ సాధించేవరకు పి ఆర్ టి యు తెలంగాణ పోరాటాలు చేస్తూనే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కనకాపురం రవీందర్, నాయకులు నాగేశ్వరరావు, సాగర్, రమేష్ బాబు, సందీప్, రమేష్, సావిత్రి, వింధ్యతాయి, జోష్ణ, అపర్ణ, సవిత, సుచిత్ర పాల్గొన్నారు.

Pension is the right of every employee
Comments (0)
Add Comment