కొల్చారం, సెప్టెంబర్ 14( అక్షర కలం):-మెదక్ జిల్లా, నర్సాపూర్ నియోజకవర్గం, కొల్చారం మండలంలో సేవా పక్షం మండల స్థాయి కార్యాశాల మండల అధ్యక్షుడు హరీష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా బిజెపి పార్టీ ఉపాధ్యక్షుడు వెల్మకన్న మాజీ సర్పంచ్ రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా బిజెపి పార్టీ ఉపాధ్యక్షుడు వెల్మకన్న మాజీ సర్పంచ్ రాజేందర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తేదీన దేశ ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా 17 తేదీ నుండి అక్టోబర్ 2 తేదీ వరకు 15 రోజులు సేవా కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు, అమ్మ పేరుతో మొక్కలు నాటడం, కుల వృత్తుల వారిని మరియు రిటైడర్ అధికారులను సన్మానించడం ప్రభుత్వ ఆసుపత్రిలో పాఠశాలల్లో పనుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నాయకులకు నిర్దేశించడం జరిగింది.