ప్రేమ విఫలమై ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య

బతుకమ్మ, నిజామాబాద్ క్రైమ్ : ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దీపక్ (20) అనే యువకుడు ప్రేమలో విఫలం కావడంతో గత కొంతకాలంగా మానసిక కుంగిపోయాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో దీపక్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తల్లి లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.