అంత్యక్రియలకు వెళ్లి అనంత లోకాలకు

బతుకమ్మ,ఇందల్వాయి : మండలంలోని సిర్నాపల్లి లో బంధువుల అంత్యక్రియలకు వెళ్లిన ఓ యువకుడు వాగులో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన సర్నాపల్లి మత్తడి వాగులో చోటు చేసుకుంది. అంత్యక్రియల అనంతరం స్నానం చేసేందుకు వాగులోకి దిగిన పోగుల రాహుల్(19) నీట మునిగిపోయాడని ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. మృతుడి తండ్రి రాజన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.