భారత ప్రధాని  పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా

బతుకమ్మ, ఆర్మూర్ : హర్ ఘర్ తిరంగా లో భాగంగా భారత దేశ ప్రధాని మోడీ పిలుపు మేరకు నేడు అర్ముర్ పట్టణం లో గోల్ బంగ్లా, కమల్ నెహ్రు కాలనీ, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ కార్యాలయం ముందు శివాలయం , హుస్నాబాద్ గల్లీ, వార్డ్ 33&35 లలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగొట గంగాధర్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ప్రజలకు ఇవ్వడం జరిగింది. ప్రధాని మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరు 15ఆగష్టు రోజున ప్రతి ఒక్కరు జాతీయ జెండాను ఇంటిపై ఎగురా వేసి దేశ భక్తిని చాటుకోవాలని, స్వాతంత్ర సంబురాన్ని సా గౌరవంగా జరుపుకుందాం అని పిలుపునిచ్చారు, ఇట్టి కార్యక్రమం లో బీజేపీ పట్టణధ్యక్షులు ద్యాగ ఉదయ్, కార్యదర్శి ఎం జె.రమేష్ బీజేపీ నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.