సామాజిక కార్యకర్త ఇస్మాయిల్ ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగరంలోని 60 వ డివిజన్ పరిధిలో సామాజిక కార్యకర్త ఇస్మాయిల్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్రం సాధించి తెచ్చి పెట్టారని స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశంలోని ప్రతి పౌరులు దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం అమరులైన ప్రతి ఒక్కరిని స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్ ఖాన్, అబ్దుల్ వాజిద్ సాహెబ్, డాక్టర్ అతిక్, హఫీజ్ లయక్ సాబ్, ఇంతియాజ్ ఖాన్
తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.