ఘనంగా  ఎడ్ల పొలాల అమావాస్య 

బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఎడ్ల పోలాల అమావాస్య పండుగను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎడ్లను పూజించారు. పంటలు బాగా పండాలని దిగుబడి బాగా రావాలని దేవున్ని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో జుక్కల్ మాజీ ఎంపీపీ యశోద నీల్ పటేల్, జుక్కల్ మాజీ సర్పంచ్ బొల్లి గంగాధర్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు, మాజీ మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

It is the new moon of dry fields

Leave A Reply

Your email address will not be published.