మురళీకృష్ణ ఆలయంలో కోటి లలిత సహస్రనామ కుంకుమార్చన

బతుకమ్మ , ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణం విద్యానగర్ కాలనీలోని మురళీకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణ పారాయణ గ్రూప్ ఆధ్వర్యంలో కోటి లలిత సహస్రనామ కుంకుమార్చనను మహిళలు పెద్ద ఎత్తున బుధవారం నిర్వహించారు. బాసర కు చెందిన ప్రణీత్ శర్మ పర్యవేక్షణలో మహిళలు కోటి లలిత సహస్రనామ కుంకుమార్చనలో పాల్గొన్నారు. ప్రణయ్ శర్మ కోటి మందితో లలిత సహస్రనామ కుంకుమార్చన చేయించడానికి చేపట్టిన దీక్షలో భాగంగా ఈ కుంకుమార్చన అధిక సంఖ్యలో గ్రూప్ మహిళలు పాల్గొనడం జరిగింది. పారాయణం గ్రూపు మహిళలు అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం గ్రూప్ మహిళలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పారాయణం గ్రూప్ మహిళలు అల్జాపూర్ చంద్రకళ, పుప్పాల ఉమాదేవి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు, కౌన్సిలర్ అల్జాపూర్ రేవతి, గడ్డం శిరీష, మేక సరిత, తాళ్ల కల్పన, తమ్మి నీరజ, సాత్ పుతే మంజుల, దేశ్ ముఖ్ సంగీత, పింగళి సూర్యమ్మ, మహిళలు గ్రూప్ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.