మౌన దీక్ష నిరసన కార్యక్రమంలో మున్నూరు కాపులు

బతుకమ్మ: బిచ్కుంద : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ముందూరు కాపుల హక్కుల సాధనకు కృషి చేయాలని డిమాండ్ చేస్తూ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర జిల్లా కమిటీల పిలుపుమేరకు ఆదివారం నాడు బిచ్కుంద మండల కేంద్రంలో మున్నూరు కాపు కార్యవర్గం ఆధ్వర్యంలో మౌన దీక్ష నిరసన ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘ పెద్దలు మాట్లాడుతూ మున్నూరు కాపులకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఐదువేల కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులను కేటాయించి మున్నూరు కాపు హక్కుల సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ మౌన దీక్ష నిరసన ఆందోళన కార్యక్రమంలో బిచ్కుంద మండలం మున్నూరు కాపులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.