బతుకమ్మ నిజామాబాద్ సిటీ : జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ భవన్ నందు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్ యువజన కాంగ్రెస్ జండా ఆవిష్కరించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు ఆయన మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ వల్ల ఒక సామాన్య కార్యకర్త కూడా ఎన్నికల ద్వారా జాతీయ స్తాయిలో గుర్తింపు పొందే అవకాశం కేవలం యువజన కాంగ్రెస్ మాత్రమే కల్పిస్తుంది అనిఅన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు లో యువజన కాంగ్రెస్ ముఖ్య పాత్ర పోషించిందని, కార్యకర్తల కష్టం చాలా ఉంది అని రానున్న రోజుల్లో అందరికీ సముచిత న్యాయం జరిగేలా పార్టీ నిర్ణయాలు ఉంటాయని ఆయన అన్నారు. రేపటి నుండి యువజన కాంగ్రెస్ ఎన్నికలు మొదలు కావున రాష్ట్రంలోనే ఆద్యాదిక సభ్యత్యాలు మన జిల్లా లో నమోదు కావాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు ప్రీతం, జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దసీర్, జిల్లా అధ్యక్ష అభ్యర్థి విపుల్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అభ్యర్థలు ఇర్ఫాన్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.