యువరైతు అత్మహత్యకు వడ్డి వ్యాపారుల వేదింపులే కారణం

. . . అర్గుల్ గ్రామంలో శవయాత్రలో గ్రామస్థుల ప్ల కార్డుల ప్రధర్శన

. . . వడ్డి వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

. . .  సుసైడ్ కు ముందు రైతు రాజేష్ సెల్పీ విడియో వైరల్

బతుకమ్మ, జక్రాన్ పల్లి

నిజామాబాద్ జిల్లాలో యువ రైతు ఆత్మహత్య కలకలం రేపుతోంది.  జక్రాన్ పల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన కుంట రాజేష్ (28) అనే యువ రైతు అప్పుల బాధ తో ఆత్మహత్య చేసు కున్నాడు. రైతు అత్మహత్యకు ముందుగా కుటుంబ సభ్యులకు పంపిన విడియో, వాయిస్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జక్రాన్ పల్లి మండలం మండలం అర్గుల్ గ్రామంలో రైతు కుంట రాజేష్ అలియాస్ ఇటుక రాకేష్ వడ్డీ వ్యాపారుల వద్ధ అప్పు తీసుకున్నాడు. ఇటుక లేబర్ కోసం 12.50 లక్షలు ఇచ్చి మోసపోయానని , అప్పులు ఇచ్చినవారు వేధిస్తున్నారని, ఇంటికి వస్తామని బెదిరింపులకు గురి చేశారని ఆవేదనతో ఆత్మహత్యకు ముందు వాయిస్ మెసేజ్ బంధువులకు పంపిన రైతు.తన మరణం అనంతరం ఎకరం  భూమిని అమ్మీన డబ్బులతో అప్పులు చెల్లించాలని కోరిన రైతు. మరో వైపు మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధిత కుటుంబాన్ని రైతు సంఘాల ప్రతినిధులు పరామర్శించారు. రాజేష్ అంత్యక్రియల సంధర్బంగా గ్రామస్థులు వడ్డి వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ప్ల కార్డులు ప్రధర్శించారు. వడ్డి వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ధరణిలో భూమి ఎక్కక పోవడం, మ్యూటేషన్ కాకపోవడంతో అమ్మకం కానీ భూమి ప్రభుత్వం ధరణి సమస్యలు తీర్చాలని, వడ్డీ వ్యాపారుల నుంచి కాపాడాలని కోరారు.

The reason for the young fgormer’s suicide was the harassment of usurers

 

 

Leave A Reply

Your email address will not be published.