బతుకమ్మ, మోర్తాడ్ :
వర్షాలు కురుస్తుండడంతో ఎగువ ప్రాంతాలను వరద నీరు అధికంగా రావడంతో ధర్మోరా, పాలెం గ్రామాల మధ్య ఉన్న చెక్ డ్యాం ఎక్కువ ప్రవాహంతో పొంగిపొర్లుతోంది. బాల్కొండకు చెందిన నువ్వులు కొనడానికి వచ్చిన వ్యాపారి ధర్మోరా నుంచి పాలెం వైపు వెళ్తూ వ్యాపారి ఆటో ప్రవాహంలో చిక్కు కు పోయింది. దీంతో స్పందించిన ధర్మోరా గ్రామస్తులు మొదటగా ట్రాక్టర్ తో ప్రయత్నించిన రాకపోవడంతో స్థానికులు స్పందించి వెంటనే గ్రామంలో ఉన్న జెసిబి తీసుకువచ్చి చేసివి సాయంతో సురక్షితంగా వ్యాపారిని ఆయన కూలీలను రక్షించారు. తము ప్రాణాపాయల్లో ఉన్నామని తెలుసుకొని రక్షించినందుకు ట్రాలీ ఆటో వ్యాపారి, కూలీలు ధర్మోరా వాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
