రుద్రూర్, బతుకమ్మ : మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై పి. సాయన్నను గురువారం రుద్రూర్ మండల నాయకులు శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్సైను సన్మానించిన వారిలో నాయకులు నారోజి గంగారం, పత్తి లక్ష్మణ్, నేరుగంటి బాలరాజు, పత్తి రాము, తోట అరుణ్ కుమార్, నడిపింటి నగేష్, సుదర్శన్ గౌడ్, జమీల్ తదితరులు పాల్గొన్నారు.