నూతన టీపీసీసీ ప్రెసిడెంట్ ను కలిసిన భీంగల్ కాంగ్రెస్ నాయకులు

బతుకమ్మ, భీంగల్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గా నూతనంగా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను ఆదివారం భీంగల్ మండల కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లో ఆయనను కలిసి శాలువతో సత్కారించి, శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ కుమార్ ను కలిసిన వారిలో మండల పార్టీ ప్రెసిడెంట్ బొదిరే స్వామి, మండల ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ గోపాల్ నాయక్, మండల ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ పర్స అనంత్ రావు, మండల బీసీ సెల్ ప్రెసిడెంట్ కోరాడి రాజు,డీసీసీ డెలికేట్ కుంట రమేష్, మండల నాయకులు అరిగేల జనార్దన్,వేముగంటి రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.