బతుకమ్మ, నిజామాబాద్ సిటీ :
నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 10 వ రాష్ట్ర స్థాయి మహిళల సీనియర్ ఫుట్బాల్ టోర్నీ కొనసాగుతోంది. రెండో రోజైన శనివారం మెదక్ – ఖమ్మం, నల్గొండ – రంగారెడ్డి జట్ల మధ్య మ్యాచులు నిర్వహించగా, మెదక్, నల్గొండ జట్లు విజయం సాధించాయి. జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టోర్నీలో తొమ్మిది జిల్లాల నుంచి జట్లు పాల్గొంటున్నాయి. మొదటి రోజైన శుక్రవారం నిర్వహించిన మ్యాచుల్లో నిజామాబాద్, మెదక్ జట్లు విజయం సాధించాయి.