బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన ఎస్ రాజన్న తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో చేరారు. వైద్య ఖర్చులకు ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుండటంతో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ ని సంప్రదించగా ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 2,00,000 ఎల్ఓసిని అందించడం జరిగింది. ఆపద సమయంలో ఆదుకున్న ముత్యల సునీల్ కు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.