- వర్గీకరణ వద్దు.. ఐక్యతే ముద్దు..
బతుకమ్మ, మద్నూర్: ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ భారత్ బంద్ లో భాగంగా ఉమ్మడి మద్నూర్, డోంగ్లి మండల కేంద్రంలో బుధవారం బంద్ “వర్గీకరణ వద్దు” “ఐక్యతే ముద్దు” అని నినాదాలు చేశారు. మాల పొలిటికల్ జేఏసీ కామారెడ్డి జిల్లా చైర్మన్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు వెనక్కి తీసుకోవాలన్నారు. ఎస్సీ వర్గంలో 59 ఉప కులాలు బలంగా ఉన్నామని వర్గీకరణతో వర్గాలుగా విడిపోయి విభేదాలు వస్తాయి. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసమే వర్గీకరణ కావాలని కోరుకుంటున్నారు. ఎస్సీ లో ఉన్న 59 కులాలు, దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకిస్తున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకాష్, మారుతి, సుధీర్, జైపాల్, సందీప్, గంగాధర్ ఎస్సీ మాలలు ఉప కులాలు పాల్గొన్నారు.
