సమస్యల పరిష్కార వేదికకు స్పందనేది?

 బతుకమ్మ, నిజామాబాద్: విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విద్యుత్ సమస్యల పరిష్కార వేదికకు స్పందన కరువైంది.  అర్సపల్లి సబ్ స్టేషన్లో నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు ఫిర్యాదులు స్వీకరించగా, ఒకే ఒక్క ఫిర్యాదు అందింది. ఎల్టీ లైన్ షిఫ్టింగ్ కోసం సతీశ్ నగర్ కు చెందిన వినియోగదారుడు దరఖాస్తు అందజేశాడు. డీఈ  శ్రీనివాస్, ఏడీఈలు చంద్రశేఖర్, తోట రాజశేఖర్, వీరేశం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.