బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండలం నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన విక్రమ్ భూపల్లి కి శుక్రవారం పలువురు కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపి పూలమాలలు వేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సుంకేట్ గ్రామ అధ్యక్షుడు ఆకుల రాజేశ్వర్, ఇసుక కమిటీ చైర్మన్ ఏనుగు రాజేశ్వర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాయి రెడ్డి, నరసింహారెడ్డి, ఏనుగు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.