బతుకమ్మ, నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో అప్పటి వరకు తెరిచి ఉన్న 5 గేట్లను మూసివేశారు. ప్రాజెక్టులో 80.053 టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో 26 వేల క్యూసెక్కుల వరద రావడంతో గేట్లను మూసివేశారు. ఈ నెల 7న రాత్రి 11 గంటల ప్రాంతంలో 8 గేట్లను తెరిచిన అధికారులు ఇన్ ఫ్లో ఆధారంగా ఆదివారం 24 గేట్లను తెరిచి లక్ష క్యూసెక్కులను విడుదల చేశారు. మళ్ళీ ఇన్ ఫ్లో తగ్గడంతో సోమవారం ఉదయం నుంచి నీటి విడుదలను తగ్గిస్తూ వస్తు గేట్లను మూసివేశారు.