మహాత్మా గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు.

 

సూర్యాపేట, అక్టోబర్ 02 (అక్షర కలం వెబ్ ):

హాత్మా గాంధీ జయంతి సందర్భంగా గురువారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.

గాంధీజీ సత్యం, అహింస, శాంతి వంటి విలువలను పాటిస్తూ దేశానికి స్వాతంత్ర్యం సాధించాడని

బాపూజీ నడిచిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని కోరారు.

ఈ కార్యక్రమానికి కలెక్టరెట్

 పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, టీఎన్జీవోస్ సెక్రెటరీ దున్న శ్యామ్,అధికారులు, సిబ్బంది తదితరులు హాజరయ్యారు.

 

Leave A Reply

Your email address will not be published.