చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షిస్తాం

  • ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. బొందాం చెరువు కబ్జాలో మోసపోయిన భారతీరానని కాలనీకి చెందిన బాధితు లను ఆయన బుధవారం పరామర్శించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. నిరుపేదలకు అక్రమంగా భూములు అమ్మి నకిలీ పట్టాలు ఇచ్చి మోసం చేశారని అన్నారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధితులకు ప్రభుత్వం నుండి ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు. మోసపోయిన నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశారు.

We will take legal action and punish severely

Leave A Reply

Your email address will not be published.